నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా..ఎందుకంటే

By సుభాష్  Published on  18 Dec 2019 3:29 PM GMT
నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా..ఎందుకంటే

2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన ఉరి శిక్షపై రివ్యూపిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. నిందితులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ నలుగురు దోషులకు ఉరిశిక్షే సరైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉరిశిక్షకు ముందు ఉన్న అన్ని న్యాయ పరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు పాటియాలా కోర్టు దోషులకు వారంరోజులు గడువు ఇచ్చింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు దోషుల తరఫు న్యాయవాది మూడు వారాల గడువు కోరినా... క్షమాభిక్షకు వారం రోజులు చాలని కోర్టు పేర్కొంది. మరోవైపు 14 రోజుల్లోగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు పాటియాలా కోర్టును కోరారు.

సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఈ పిటీషన్ వాయిదా వేసిన న్యాయస్ధానం నేడు విచారణ జరిపింది సర్వోన్నత న్యాయస్ధానం రివ్యూ పిటీషన్ ను కొట్టి వేసేందుకు డెత్ వారంట్ జారీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని నిర్బయ తల్లితరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. న్యాయపరమైన అవాకాశాలు పూర్తయిన తర్వాతే డెత్ వారంట్ జారీ చేయాలని నిందితుల తరుఫు న్యాయవాదులు కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం దోషులకు మరో వారంరోజులు గడువు ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.

కోర్టులో కన్నీరు పెట్టుకున్న 'నిర్భయ తల్లి'

సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై నిర్భయ తల్లి కోర్టు హాలులోనే కన్నీరు పెట్టుకున్నారు. దోషుల హక్కుల గురించే కోర్టు పట్టించుకుందని, తమ హక్కులవు పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ న్యాయమూర్తి .... మీపై మాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ దోషులకు హక్కులుంటాయి కదా..మీ వాదనలు మేము వింటాం ..అదే సమయంలో చట్టానికి లోబడి వ్యవహరిస్తాం అని హామీ ఇచ్చారు. తదుపరి విచారణ తర్వాత కూడా తీర్పు వస్తుందని మాకు నమ్మకం లేదంటూ నిర్భయ తల్లి మీడియాతో తెలిపింది.

Next Story