సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులు.. దూరంగా నిల్చోవాలన్న మాజీ మంత్రి రోజా

తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని క్లీనింగ్ చేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది రోజాతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు.

By అంజి
Published on : 17 July 2024 9:10 AM IST

YSRCP leader, temple cleaning staff, selfie, Roja

సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులు.. దూరంగా నిల్చోవాలన్న మాజీ మంత్రి రోజా

తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని క్లీనింగ్ చేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా, వారిని దూరంగా ఉంచాలని నటి, వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు రోజా సెల్వమణి సూచించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోజా, ఆమె భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి సోమవారం ఆలయాన్ని సందర్శించినప్పుడు తిరుచెందూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

దర్శనానంతరం పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది దంపతుల వద్దకు వచ్చి సెల్‌ఫోన్‌లతో సెల్ఫీలు దిగారు. ఆ సమయంలో, ఆలయంలో పనిచేసే ఇద్దరు మహిళా క్లీనింగ్ సిబ్బంది రోజాను సెల్ఫీ కోసం సంప్రదించినప్పుడు, నటి, రాజకీయ నాయకురాలు తమకు దూరం ఉండమని వారికి సూచించడం వీడియోలో కనిపించింది. మహిళా కార్మికులు తమ వెనుక చేతులు పట్టుకుని రోజాతో సెల్ఫీకి పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Next Story