విషాదం.. ఆస్పత్రిలో లిఫ్ట్‌ కూలి బాలింత మృతి.. బిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం ప్రసవించిన ఓ మహిళ లిఫ్టు కూలి మృతి చెందింది. లోహియా నగర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు.

By అంజి  Published on  6 Dec 2024 11:15 AM IST
Woman died, hospital, lift crash, vandalise, hospital property

విషాదం.. ఆస్పత్రిలో లిఫ్ట్‌ కూలి బాలింత మృతి.. బిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం ప్రసవించిన ఓ మహిళ లిఫ్టు కూలి మృతి చెందింది. లోహియా నగర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. రోగి బంధువులు నిరసన చేపట్టి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో ఈ సంఘటన ఆసుపత్రిలో గందరగోళాన్ని రేకెత్తించింది. కరిష్మా అనే మహిళను ప్రసవం తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోని వార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమెతోపాటు ఇద్దరు ఆసుపత్రి ఉద్యోగులు కూడా లిఫ్ట్‌లో ఉన్నారు. లిఫ్ట్ కిందకు దిగడం ప్రారంభించడంతో, దాని కేబుల్ తెగిపోయింది. అది క్రాష్ అయింది.

కరిష్మా తలకు, మెడకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. గాయపడిన ఇద్దరు ఆసుపత్రి సిబ్బందిని 45 నిమిషాల తర్వాత లిఫ్ట్ డోర్ పగలగొట్టి రక్షించారు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారని రోగి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరిష్మా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. అయితే, కరిష్మా చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మహిళ బంధువులు క్యాపిటల్ హాస్పిటల్ వద్ద గొడవ సృష్టించి ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. గందరగోళం మధ్య, ఆసుపత్రిలో చేరిన 13 మంది రోగులను మరొక ఆసుపత్రికి తరలించారు.

Next Story