విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భర్త లేని లోకంలో బతకలేక.. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  27 Feb 2024 12:15 PM GMT
wife, suicide,  husband death,  delhi,

విషాదం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య 

ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. భర్త లేని లోకంలో బతకలేక.. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు వారివారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

ఘజియాబాద్‌కు చెందిన అభిషేక్ అహ్లువాలికి అంజలి అనే అమ్మాయితో గతేడాది నవంబర్‌లోనే వివాహం జరిగింది. అయితే.. వీరిద్దరూ సోమవారం ఢిల్లీఓలని జూకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే అక్కడకు వెళ్లారు. ఉన్నట్లుండి అభిషేక్‌కు ఛాతిలో నొప్పి అనిపించింది. దాంతో.. అంజలికి చెప్పాడు. ఆమె కూడా వెంటనే అప్రమత్తమై స్నేహితులకు చెప్పింది. వారి సాయంతో తన భర్త అభిషేక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. అక్కడికి వెళ్లే సరికి అభిషేక్ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. కానీ.. అభిషేక్‌ చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. గుండెపోటు కారణంగానే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక రాత్రి వరకు అన్నింటినీ పూర్తి చేసుకుని మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది అంజలి. భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. భర్త లేని లోకంలో తాను కూడా ఉండొద్దని నిర్ణయించుకుంది. తాను నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ ఏడో అంతస్తు బాల్కానీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక తీవ్రగాయాలైన అంజలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతు ఆమె మంగళవారం చనిపోయారు. అభిషేక్‌ శవాన్ని చూస్తూ చాలా సేపు ఏడ్చిందనీ.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి బాల్కానీ నుంచి దూకేసిందని బంధువులు తెలిపారు. తాము కాపాడే ప్రయత్నం చేశామనీ కానీ ఫలితం దక్కలేదన్నారు. కాగా.. 24 గంటల వ్యవదిలోనే భార్యాభర్తలు చనిపోవడం వారి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Next Story