మోదీని '28 పైసల ప్రధాని' అని పిలవాలి: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ శనివారం నిధుల కేటాయింపుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై విరుచుకుపడ్డారు.

By అంజి  Published on  24 March 2024 4:17 AM GMT
Narendra Modi, 28 paisa PM, Udhayanidhi Stalin

మోదీని '28 పైసల ప్రధాని' అని పిలవాలి: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ శనివారం నిధుల కేటాయింపుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయికి రాష్ట్రానికి కేవలం 28 పైసలు మాత్రమే చెల్లించిందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ డబ్బు పొందాయని ఆరోపించారు. రామనాథపురం, తేనిలో వేర్వేరు ర్యాలీలలో ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. "ఇప్పుడు, మనం ప్రధానిని '28 పైసా పిఎం' అని పిలవాలి అన్నారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రంపై ఉదయనిధి స్టాలిన్ తన పోరాటాన్ని కొనసాగించారు.

తమిళనాడులో పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి జాతీయ విద్యా విధానాన్ని (NEP) తీసుకువచ్చారని పేర్కొన్నారు. నిధుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో నీట్‌ను నిషేధించడం వంటి అంశాల్లో తమిళనాడుపై కేంద్రం ‘వివక్ష’ చూపిందని అన్నారు. లాంఛనప్రాయ నిరసనలో, ప్రాజెక్ట్ పునాది - శంకుస్థాపన దశను దాటి కదలలేదని హైలైట్ చేయడానికి అతను 'AIIMS మధురై' ఇటుకను తీసుకువచ్చాడు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ప్రధాని తమిళనాడు పర్యటనకు వస్తున్నారని డీఎంకే మంత్రి ఆరోపించారు. 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Next Story