వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రైళ్లలో ఉచిత వాటర్ బాటిళ్లు
వందే భారత్ రైలు ప్రయాణంలో రైల్ నీడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పిడిడబ్ల్యు) 500 ml బాటిల్ అందించబడుతుందని భారతీయ రైల్వే ప్రకటించింది.
By అంజి Published on 25 April 2024 1:03 PM IST
వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రైళ్లలో ఉచిత వాటర్ బాటిళ్లు
త్రాగునీరు వంటి సహజ వనరులను సంరక్షించడం గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పుడు వందే భారత్ రైలు ప్రయాణంలో రైల్ నీడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పిడిడబ్ల్యు) 500 ml బాటిల్ అందించబడుతుందని భారతీయ రైల్వే ప్రకటించింది. ఎటువంటి అదనపు డబ్బు వసూలు చేయకుండా డిమాండ్పై ప్రతి ప్రయాణీకుడికి 500 ml నీటి బాటిల్ ఇవ్వబడుతుంది. తాగునీటి వృథాను అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు భారతీయ రైల్వే తెలిపిందని వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఇప్పటి వరకు రాజధాని ఎక్స్ప్రెస్ మాదిరిగానే వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారందరికీ ఒక లీటర్ పీడీడబ్ల్యూ బాటిళ్లను పంపిణీ చేశారు. అయితే, ప్రయాణీకులందరూ ఒక లీటరు నీటిని పూర్తిగా వినియోగించడం లేదని, అదే వృధా అవుతుందని రైల్వే తెలిపింది. వందే భారత్ రైళ్లు రాజధానిలా ఎక్కువ దూరం ప్రయాణించవు, ఇది కూడా రైల్వే నిర్ణయానికి ఒక కారణం కావచ్చు. 2019లో శతాబ్ది రైళ్లలో ఇదే విధమైన చొరవ ప్రవేశపెట్టబడింది. ఇక్కడ ప్రయాణీకులకు ఒక లీటర్ వాటికి బదులుగా 500 ml పీడీడబ్ల్యూ వాటర్ బాటిల్లు ఇవ్వబడ్డాయి.
ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రస్తుతం భారతదేశంలోని 40 కంటే ఎక్కువ మార్గాల్లో పనిచేస్తున్నాయి. ఫిబ్రవరి 15, 2019న న్యూ ఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో మొదటి రైలును పీఎం మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. రైళ్లు సెమీ-హై-స్పీడ్తో నడుస్తాయి. వైఫై కనెక్టివిటీ, భారీ గాజు కిటికీలు, 32-అంగుళాల స్క్రీన్లు, ఫుట్రెస్ట్లు, మినీ ప్యాంట్రీ వంటి బహుళ ఆధునిక ఫీచర్లతో ఉన్నాయి.
ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, తెలంగాణతో సహా భారతదేశం అంతటా అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన హీట్ వేవ్ మధ్య రైల్వే కొత్త వాటర్ బాటిల్ పాలసీని ప్రకటించింది.