180 కి.మీ వేగంతో దూసుకువెళ్లిన వందే భారత్ ట్రైన్
Vande Bharat Express Crosses 180 Kmph Speed Limit During Trial Run.దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన
By - తోట వంశీ కుమార్ |
దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్లో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కోటా-నాగ్డా సెక్షన్ మద్య శుక్రవారం టెస్ట్ రన్ను నిర్వహించగా రైలు ఈ వేగాన్ని అందుకున్నట్లు మంత్రి తెలిపారు.
తొలి వందేభారత్ రైలు 2019లోనే దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ-వారణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఢిల్లీ-వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును తీసుకువచ్చారు. తాజాగా కోటా(రాజస్థాన్)- నగ్ధా(మధ్యప్రదేశ్) సెక్షన్లో ట్రయల్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్ నిర్వహిస్తున్న సమయంలో రైలులో వాషింగ్, క్లీనింగ్తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్లు మంత్రి ట్వీట్ చేశారు.
Superior ride quality.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022
Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy
రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్ యాప్ను స్మార్ట్ఫోన్లో ఆన్ చేసి దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను తీశారు. ఆ వీడియో ఓ సమయంలో రైలు 183 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవడం కనిపించింది. వేగంగా వెలుతున్నప్పటికీ మంచి గ్లాసు కూడా పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. త్వరలోనే మరిన్ని వందే భారత్ రైల్లు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.
#VandeBharat-2 speed trial started between Kota-Nagda section at 120/130/150 & 180 Kmph. pic.twitter.com/sPXKJVu7SI
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022