పొగాకు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వారి పిల్లల కోసం స్పెషల్‌ స్కీమ్‌

గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో అధికారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమీక్ష నిర్వహించారు.

By అంజి
Published on : 16 Jun 2025 7:24 AM IST

Union Minister Piyush Goyal, Guntur, Tobacco Board office, tobacco farmers

పొగాకు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వారి పిల్లల కోసం స్పెషల్‌ స్కీమ్‌ 

అమరావతి: గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో అధికారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమీక్ష నిర్వహించారు. బర్లీ పొగాకు ధరలు, పొగాకు రైతుల సమస్యలు, కొనుగోళ్లు అంశంపై ఆయన సమీక్షించారు. బోర్డు ద్వారా పొగాకు రైతుల పిల్లల ఉన్నత చదువులకు వడ్డీలేని రుణాల కాలపరిమితిని ఐదేళ్లకు పెంచేందుకు నిర్ణయించారు. పొగాకు లాభసాటి పంటగా మారిందన్నారు. పరిమితికి మంచి బర్లీ పొగాకు పండించడంతోనే సమస్య తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా పోర్ట్‌లు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో రూ.1.6కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

కొత్త ఉద్యోగ కల్పన జరుగుతుందని, పరిమితికి మించి పొగాకు సాగు చెయొద్దని ఈ సందర్భంగా రైతులకు కేంద్రమంత్రి సూచించారు. గత నాలుగేళ్లలో పోగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని.. పొగాకు రైతుల సమస్యల‌ పరిష్కారానికి చర్యలు చేపట్టామని చెప్పారు. అటు కేంద్రమంత్రి పీయూష్‌తో భేటీ అయినట్టు సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి సంబంధించిన కీలక విషయాలపై కేంద్రమంత్రితో ఫలప్రదమైన చర్చలు జరిపామన్నారు. పొగాకు రైతులకు కేంద్రం మద్దతు, మామిడి గుజ్జుపై GST తగ్గింపు, ఆక్వా ఎగుమతులకు ఉపశమనం, ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాలను సమీక్షించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని అభ్యర్థించానని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story