పోలింగ్‌కు ముందు భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

Two killed, five injured in explosion in Churachandpur ahead of first phase of polling. మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన పేలుడులో ఆరేళ్ల బాలుడితో సహా ఇద్దరు

By అంజి  Published on  27 Feb 2022 2:39 AM GMT
పోలింగ్‌కు ముందు భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన పేలుడులో ఆరేళ్ల బాలుడితో సహా ఇద్దరు మరణించారు. గ్యాంగ్పిమువల్ గ్రామంలో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. సమీపంలోని బీఎస్‌ఎఫ్‌ ఫైరింగ్ రేంజ్ నుండి స్థానిక నివాసితులు పేలని మోర్టార్ షెల్‌ను తీసుకున్న తర్వాత ఇది సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. పేలుడు జరిగిన ప్రదేశం నుండి ఏడుగురు క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఆరేళ్ల బాలుడితో సహా ఇద్దరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను 6 ఏళ్ల మంగ్‌మిన్‌లాల్‌, 22 ఏళ్ల లాంగిన్‌సాంగ్‌గా గుర్తించారు. మణిపూర్ పోలీసులు పేలుడు జరిగిన ప్రదేశంలో ఒక ఫిన్ యూనిట్ మోర్టార్ షెల్, కొన్ని స్ప్లింటర్‌లను కనుగొన్నారు. జిల్లా కమీషనర్, జిల్లా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదని చెప్పారు. మణిపూర్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల లోపే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Next Story