'ఈ వ్యవస్థతో విసిగిపోయింది'.. వినేష్ ఫోగట్ రిటైర్మెంట్‌పై శశి థరూర్ కామెంట్స్‌

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన ఒక రోజు తర్వాత రెజ్లర్ వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

By అంజి  Published on  8 Aug 2024 4:37 AM GMT
Shashi Tharoor, Vinesh Phogat, Olympics, wrestler

వినేష్ ఫోగట్ రిటైర్మెంట్‌పై శశి థరూర్ కామెంట్స్‌

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన ఒక రోజు తర్వాత రెజ్లర్ వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె నిర్ణయంపై రాజకీయ నాయకులు.. పార్టీ శ్రేణులకు అతీతంగా పునరాలోచించాలని కోరారు. వినేష్ ఫోగట్ "ఈ వ్యవస్థతో విసిగిపోయారని" సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆమెను శక్తి, ధైర్యానికి చిహ్నంగా పేర్కొన్నారు. "ఈ అమ్మాయి ఈ వ్యవస్థతో విసిగిపోయింది.. ఈ అమ్మాయి పోరాటంలో విసిగిపోయింది" అని థరూర్ ఎక్స్‌లో క్రిప్టిక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

బీజేపీ నేత, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై పలువురు రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేసిన నిరసనల్లో ఫోగట్‌ పాల్గొన్నారు. "వినీష్ ఫోగట్, మీరు ఓడిపోలేదు, మీరు శక్తి మరియు ధైర్యానికి చిహ్నం. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది మరియు ఈ కష్ట సమయంలో మీకు అండగా నిలుస్తుంది" అని గౌరవ్ గొగోయ్ పోస్ట్ చేశారు.

Next Story