వ‌ణికిస్తున్న‌ చలి.. జనవరి 14 వరకూ ఆ జిల్లాలో అన్ని పాఠశాలలు బంద్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో తరగతి నర్సరీ నుండి 8వ తరగతి వరకు అన్ని బోర్డు పాఠశాలలు జనవరి 14 వరకు మూసివేయనున్న‌ట్లు

By Medi Samrat  Published on  6 Jan 2024 9:21 AM GMT
వ‌ణికిస్తున్న‌ చలి.. జనవరి 14 వరకూ ఆ జిల్లాలో అన్ని పాఠశాలలు బంద్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో తరగతి నర్సరీ నుండి 8వ తరగతి వరకు అన్ని బోర్డు పాఠశాలలు జనవరి 14 వరకు మూసివేయనున్న‌ట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. శీతాకాలం, పొగమంచు కారణంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. చలిగాలులు, చలి తీవ్రత దృష్ట్యా జిల్లాలో 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి 14 వరకూ జిల్లా క‌లెక్ట‌ర్‌ సెలవు ప్రకటించారు. ఈ మేర‌కు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో పెరుగుతున్న చలి దృష్ట్యా జిల్లా యంత్రాంగం పాఠశాలలకు సెలవులను పొడిగించింది. గతంలో క‌లెక్ట‌ర్‌ ఆదేశాల మేరకు డిసెంబర్ 6వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు జనవరి 14 వరకు సెలవులు ఉంటాయని పేర్కొంది.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశం అంతటా చలిగాలులు, పొగమంచుల‌ విధ్వంసం కొనసాగుతోంది. పొగమంచు కారణంగా సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. చ‌లి ప్రభావం విమాన ప్ర‌యాణాలపై కూడా కనిపిస్తుంది.

Next Story