మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుతేంద్రరాజా టి అలియాస్ శాంతన్‌ ఫిబ్రవరి 28, బుధవారం మరణించాడు.

By అంజి  Published on  28 Feb 2024 4:05 AM GMT
Rajiv Gandhi, Santhan, Chennai, LTTE

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుతేంద్రరాజా టి అలియాస్ శాంతన్‌ ఫిబ్రవరి 28, బుధవారం మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్‌ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన శాంతన్.. 2022లో విడుదలయ్యాడు. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్‌టీటీఈలో పని చేసేవాడు. శాంతన్ వయసు 56 ఏళ్లు.

అతను నవంబర్ 2022 లో సుప్రీంకోర్టు ద్వారా విడుదలయ్యాడు. అప్పటి నుండి తమిళనాడులోని తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపస్‌లోని ప్రత్యేక శిబిరంలో ఉంచబడ్డాడు. చెన్నైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) ఫిబ్రవరి 23న అతడిని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేయగా, మరో రెండు రోజుల్లో శ్రీలంకకు పంపించనున్నట్లు తెలిసింది. అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో శాంతన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. ఫిబ్రవరి 28 ఉదయం 7.50 గంటలకు గుండె ఆగిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అతను క్రిప్టోజెనిక్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నాడు.

న్యాయవాది పుగజెంధీ, శాంతన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఉదయం 7.50 గంటలకు శాంతన్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. "అతను మరణించినప్పుడు అతని సోదరుడు ఆసుపత్రిలో ఉన్నాడు. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని శ్రీలంకలోని ఆయన ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి'' అని అన్నారు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో నలుగురు శ్రీలంక దోషులు - శాంతన్, రాబర్ట్ పయాస్, మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్ - విడుదలైన తర్వాత వెల్లూరు జైలు నుండి తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపులో ఉన్న ప్రత్యేక శిబిరానికి తరలించారు. జాఫ్నా నివాసి అయిన శాంతన్ 1990లో LTTE స్పాన్సర్ చేసిన విద్యార్థిగా భారతదేశానికి వచ్చారు. అతను శ్రీపెరంబుదూర్ మైదానంలో హత్యా బృందంతో లేనప్పటికీ, శాంతన్ బయటే ఉండి ఏదైనా తప్పు జరిగితే LTTE హ్యాండ్లర్‌కు తెలియజేసేందుకు ఉన్నాడు. అత్యున్నత న్యాయస్థానం ప్రకారం, అతను హత్య కుట్ర గురించి తెలుసు, హంతకులకు ఆశ్రయం కల్పించడంలో దోషిగా ఉన్నాడు.

జనవరిలో శాంతన్ అనారోగ్యంతో ఉన్నందున తనను ఆసుపత్రికి తరలించాలని అధికారులను కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రత్యేక శిబిరంలో ఉన్న అధికారులు తనకు వైద్యం అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున తనను బహిష్కరించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. జూన్ 2023లో, అతను ప్రత్యేక శిబిరం నుండి విడుదల చేయాలని కోరుతూ ఒక లేఖ రాశాడు, అందులో శరణార్థుల కోసం ప్రత్యేక శిబిరంలోని గది కంటే జైలు మంచిదని, తమిళ ప్రజలు తమ స్వరం పెంచాలని కోరాడు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో నలుగురు దోషులను ప్రత్యేక శిబిరంలోని ప్రధాన భాగానికి దూరంగా, కిటికీలు టిన్‌షీట్‌తో మూసివేసిన గదుల్లో ఉండేలా చేశారని లేఖలో పేర్కొన్నారు. “ఈలం తమిళులు, తమిళ ప్రవాసులు మా కోసం తమ స్వరం వినిపించాలి. మీ సుదీర్ఘ మౌనం మమ్మల్ని అణచివేయాలనుకునే వారికి తప్పుడు సందేశాన్ని పంపుతోంది. 32 ఏళ్లుగా అమ్మను చూడలేదు. మా నాన్నగారి చివరి సంవత్సరాలలో నేను అతనితో ఉండలేకపోయాను. అది నన్ను కలవరపెడుతోంది. మా అమ్మ చివరి రోజుల్లో ఆమెతో ఉండాలనే నా కోరిక తప్పైతే, నన్ను ఎవరూ ఆదుకోవాల్సిన అవసరం లేదు” అని రాశారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల సభలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) ఆత్మాహుతి బాంబర్‌తో హత్య చేయబడ్డారు. జనవరి 20, 1998న టాడా (టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం) కోర్టు 26 మంది నిందితులకు మరణశిక్ష విధించింది. 1999లో, 19 మంది వ్యక్తులు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. మిగిలిన ఏడుగురు - మురుగన్, నళిని, AG పెరారివాలన్, సంతన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ మరణశిక్షలను కొనసాగించారు, తరువాత అది జీవిత ఖైదుగా మార్చబడింది.

Next Story