రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ విజయవంతం
President Kovind's bypass surgery. ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతమైంది.
By Medi Samrat Published on 30 March 2021 12:11 PM GMT
ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతమైంది. ఢిల్లీ ఎయిమ్స్లో మంగళవారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్కు బైపాస్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్లో రాష్ట్రపతి రామ్నాథ్కు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలిపారు.
The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi.
— Rajnath Singh (@rajnathsingh) March 30, 2021
I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji's health. Praying for his well-being and speedy recovery.
రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఎయిమ్స్ డైరెక్టర్తో మాట్లాడి తెలుసుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ విజయవంతంపై వైద్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఆరోగ్యం కోసం, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిద్దామని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఇటీవల ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతిని.. సిబ్బంది వెంటనే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు.