రైలు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. బోగీలను వెనక్కి తోసిన ప్రయాణికులు.. వీడియో వైరల్‌

Passengers Push Train Away From Burning Engine, Coaches In UP. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని దౌరాలా స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఆగిన సమయంలో మంటలు

By అంజి  Published on  5 March 2022 8:34 AM GMT
రైలు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. బోగీలను వెనక్కి తోసిన ప్రయాణికులు.. వీడియో వైరల్‌

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని దౌరాలా స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఆగిన సమయంలో మంటలు చెలరేగాయి. సహరాన్‌పూర్ - ఢిల్లీ ప్యాసింజర్ రైలు ఇంజన్, రెండు కోచ్‌లలో మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు నుండి దిగి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైలు ఇంజిన్‌, మొదటి రెండు కోచ్‌లలో మంటలు రావడంతో ప్రయాణికులు అలర్ట్‌ అయ్యారు. రైలును ఇంజిన్‌ నుండి వేరు చేసి వెనక్కి తోసుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏఎన్‌ఐ మీడియా సంస్థ షేర్‌ చేసిన వీడియోలో.. మిగిలిన కంపార్ట్‌మెంట్‌లను ఇంజిన్, రెండు కంపార్ట్‌మెంట్‌ల నుండి మంటలు చెలరేగిన వాటిని వేరు చేయడానికి ప్రయాణికులు రైలును నెట్టడం కనిపించింది. మంటలు వ్యాపించకుండా, విషాదాన్ని నివారించడానికి అనేక మంది ప్రయాణికులు రైలును, ఇంజిన్ నుండి దూరంగా నెట్టడం వీడియోలో చూపబడింది. రైలు దౌరాలా సమీపంలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందిందని ఢిల్లీ డీఆర్‌ఎం డింపీ గార్గ్ తెలిపారు.

Next Story