రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్: బీహార్ ప్రజలకు భావోద్వేగ లేఖ
రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నాలుగు నెలలకే నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడం...
By - అంజి |
రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్: బీహార్ ప్రజలకు భావోద్వేగ లేఖ
పాట్నా: రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నాలుగు నెలలకే నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. "గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన నమ్మకం, మద్దతు వల్లే నేను పూర్తి అంకితభావంతో బీహార్కు సేవ చేయగలిగాను" అని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
తన పార్లమెంటరీ ప్రయాణంలో శాసనసభ, శాసనమండలి (బీహార్), లోక్సభ, రాజ్యసభ (పార్లమెంటు) అనే నాలుగు సభల్లోనూ సభ్యుడిగా ఉండాలనేది తన చిరకాల కోరిక అని, ఆ ఆకాంక్ష మేరకే ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నానని ఆయన వివరించారు. ఢిల్లీకి వెళ్తున్నప్పటికీ బీహార్తో తన బంధం విడదీయలేనిదని ఆయన స్పష్టం చేశారు.
"అభివృద్ధి చెందిన బీహార్ను నిర్మించాలనే నా సంకల్పం మారదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎప్పుడూ ఉంటాయి" అని ఆయన భరోసా ఇచ్చారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేడీయూ అధినేతగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ, ఇటు జాతీయ స్థాయిలోనూ కీలక మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
पिछले दो दशक से भी अधिक समय से आपने अपना विश्वास एवं समर्थन मेरे साथ लगातार बनाए रखा है, तथा उसी के बल पर हमने बिहार की और आप सब लोगों की पूरी निष्ठा से सेवा की है। आपके विश्वास और समर्थन की ही ताकत थी कि बिहार आज विकास और सम्मान का नया आयाम प्रस्तुत कर रहा है। इसके लिए पूर्व में…
— Nitish Kumar (@NitishKumar) March 5, 2026