మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్కు మరోసారి మంత్రి పదవి దక్కింది. ఛగన్ భుజబల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధనంజయ్ ముండే రాజీనామా తర్వాత, మంత్రివర్గంలో ఒక పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ పదవిని ఛగన్ భుజబల్కు కేటాయించారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్భవన్లో ఛగన్ భుజబల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.