ఏడు లక్షల విలువైన బంగారం ఉన్న బ్యాగ్ ను తిరిగిచ్చేసిన బాలిక

MP Girl Returns Purse With Jewellery Worth Rs 7 Lakh to Owner.మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా ఉదయపురా పోలీస్ స్టేషన్

By M.S.R  Published on  24 Feb 2022 7:32 AM GMT
ఏడు లక్షల విలువైన బంగారం ఉన్న బ్యాగ్ ను తిరిగిచ్చేసిన బాలిక

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా ఉదయపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కకరువా గ్రామంకు చెందిన బాలికకు ఓ బ్యాగ్ రోడ్డుపై కనిపించింది. అందులో ఏడు లక్షలకు పైగా విలువ ఉన్న బంగారం ఉంది. అయితే ఆ బాలిక ఎంతో నిజాయితీగా తిరిగిచ్చేసింది. యశ్‌పాల్‌ సింగ్‌ పటేల్‌ కుమార్తె పర్సు బైక్ పై వెళుతుండగా రోడ్డుపై పడింది. పర్సులో రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదే సమయంలో ఆరో తరగతి చదువుతున్న రీనా అనే విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు పర్సు కనిపించింది. బైక్ పై వెళ్లిన వాళ్ళు తిరిగొచ్చి పర్స్ తీసుకుంటారని ఆమె అక్కడ కొంతసేపు వేచి ఉంది.

ఆమె చాలాసేపు వేచి ఉంది మరియు పర్సు తీసుకోవడానికి ఎవరూ తిరిగి రాకపోవడంతో, రీనా తన ఇంటికి చేరుకుని, ఆమె తండ్రి మంగళ్ సింగ్ హరిజన్‌కు విషయం తెలిపింది. రీనాది నిరుపేద కుటుంబం. మంగళ్ సింగ్ ఉదయపురాలో కూలీగా పనిచేస్తున్నాడు. మంగళ్ సింగ్, రీనా పర్సు గురించి పోలీసులకు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

రీనా నిజాయితీకి బహుమతి లభించింది

పోలీస్ స్టేషన్‌లో రీనా పర్సును పోలీసులకు అప్పగించింది. దీంతో పర్సు యజమాని యశ్‌పాల్ పటేల్‌కు పోలీసులు సమాచారం అందించారు. యశ్‌పాల్ పటేల్ పర్సును తిరిగి దక్కడంతో రీనా నిజాయితీకి ఎంతగానో ముగ్ధుడై ఆమెకు రూ.51,000 నగదు, బట్టలు ఇచ్చాడు. రీనా నిజాయితీకి గానూ ఉదయ్‌పురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ శర్మ 1100 రూపాయలను అవార్డుగా ఇచ్చారు. రీనాను ఆమె పాఠశాలలో సత్కరించారు. పాఠశాలకు రీనా గుర్తింపు తెచ్చిందని ఉపాధ్యాయుడు అనిల్ రఘువంశీ అన్నారు. "ఆడపిల్లలకు ఇలాంటి విలువలు నేర్పిన ఆమె తల్లిదండ్రులకు నేను నమస్కరిస్తున్నాను. మా స్కూల్ అమ్మాయికి ఇలాంటి విలువలున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం'' అని అనిల్ అన్నారు.

Next Story