ఆర్బీఐ కీలక నిర్ణయం.. పిన్‌ లేకుండా రూ.5 వేల వరకు లావాదేవీలు

Limit for Contactless card transactions raised.. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)

By సుభాష్  Published on  4 Dec 2020 9:00 AM GMT
ఆర్బీఐ కీలక నిర్ణయం.. పిన్‌ లేకుండా రూ.5 వేల వరకు లావాదేవీలు

డిజిటల్‌ చెల్లింపుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ మహమ్మారి పరిస్దితుల్లో మరింత సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్‌ కార్డులు, ఈ-మాండేట్‌ల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ.2 వేల వరకు చెల్లింపులు, లావాదేవీలను పిన్‌ నంబర్‌ అవసరం లేకుండా జరుపుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 వేల వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు.

ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది డిజిటల్‌ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీలు, ఈ-మాండేట్‌లు కస్టమర్లకు మరింత సౌకర్యంగా మారుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది.

అలాగే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే నెఫ్ట్‌,ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసినట్లు ఆర్బీఐ గుర్తు చేసింది. ఆర్‌టీజీఎస్‌ సేవలను కూడా ప్రతి రోజు 24x7 పాటు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.

Next Story