ప్రతిపక్ష నేతగా ఉండాలని రాహుల్ని కోరాం: కేసీ వేణుగోపాల్
రాహుల్గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరింది.
By Srikanth Gundamalla
ప్రతిపక్ష నేతగా ఉండాలని రాహుల్ని కోరాం: కేసీ వేణుగోపాల్
ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్ చెప్పారు. దీనిపై స్పందించిన రాహుల్గాంధీ.. త్వరలోనే దీనిపై తన నిర్ణయం చెప్తానని అన్నారట. ఈ విషయం మీడియా సమావేశంలో వెల్లడించారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవంగా ప్రతిపాదన చేశామని కేసీ వేణుగోపాల్ చెప్పారు. తమ ప్రతిపాదనపై ఆలోచన చేసి త్వరగానే నిర్ణయం తీసుకుంటానని రాహుల్గాంధీ చెప్పారని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం వెల్లడించనున్నారని అన్నారు. కాగా.. రాహుల్గాంధీ ఈసారి కాంగ్రెస్ ఎకకువ సీట్లు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించడనే చెప్పాలి. ఆయన రెండు విడుతలుగా చేపట్టిన జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింత వెళ్లారు.. కాంగ్రెస్ను బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2014లో అధికారం నుంచి వైదొలిగిన తర్వాత కాంగ్రెస్కు లోక్సభలో ప్రతిపక్ష నేత పదవి దక్కడం ఇదే తొలిసారి. 2014 మరియు 2019 రెండింటిలోనూ హౌస్లోని మొత్తం సీట్లలో దాని సంఖ్య అవసరమైన 10 శాతం కంటే తక్కువగా ఉన్నందున ఇది గత 10 సంవత్సరాలలో ఈ స్థానాన్ని పొందడంలో విఫలమైంది. 2019 ఎన్నికల్లో 52 ఎంపీ స్థానాల నుంచి 99కి పెంచుకున్న కాంగ్రెస్ లోక్సభలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మరోవైపు ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీ రెండోచోట్ల పోటీ చేసి.. రెండుస్థానాల్లోనూ గెలిచారు. యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయానాడ్లో రాహుల్ గెలిచారు. ఇక ఏదో ఒక స్థానాన్ని వదులుకునేందుకు రాహుల్గాంధీ సిద్ధం అవుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నది కాబట్టి.. ఈ మూడునాలుగు రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటారని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక మరోవైపు నితీశ్కుమార్తో చర్చలు.. ఇండియా కూటమి ఆయనకు పీఎం పదవి ఇస్తారనే ప్రచారంపై కేసీ వేణుగోపాల్ తనకు ఈ విషయం తెలియదని చెప్పారు.