విమాన ప్రమాదంలో మృతి చెందిన నర్సుపై.. ప్రభుత్వ ఉద్యోగి అవమానకర వ్యాఖ్యలు

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన 39 ఏళ్ల నర్సు రంజిత జి నాయర్‌ను అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ రాసినందుకు కేరళ ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయబడ్డారు.

By అంజి
Published on : 14 Jun 2025 9:46 AM IST

Kerala, official suspended, casteist post, Ahmedabad, plane crash victim

విమాన ప్రమాదంలో మృతి చెందిన నర్సుపై.. ప్రభుత్వ ఉద్యోగి అవమానకర వ్యాఖ్యలు 

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన 39 ఏళ్ల నర్సు రంజిత జి నాయర్‌ను అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ రాసినందుకు కేరళ ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయబడ్డారు. కాసర్గోడ్ జిల్లాలోని వెల్లరికుండు తాలూకా కార్యాలయంలో జూనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ పవిత్రన్.. బాధితురాలి కులం, ప్రభుత్వ ఉద్యోగ స్థితి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ చేయబడినట్లు రెవెన్యూ మంత్రి కె రాజన్ ధృవీకరించారు.

"ఇది డిప్యూటీ తహసీల్దార్ చేసిన నీచమైన చర్య. ఈ పోస్ట్ నా దృష్టికి వచ్చిన వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని ఉత్తర్వు జారీ చేయబడింది" అని మంత్రి ఫేస్‌బుక్ ప్రకటనలో తెలిపారు. పవిత్రన్ తన పోస్ట్‌లో రంజిత కులాన్ని ప్రస్తావిస్తూ, “కేరళకు చెందిన ఒక నాయర్ మహిళ మరణించింది. ఆమె తనకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి సెలవు తీసుకుని మరొకరి అవకాశాన్ని పాడుచేసి యూకేకి వెళ్ళింది. ఏమీ అనిపించడం లేదు. అందరికీ సంతాపం” అని రాశారు.

కేరళలో నాయర్ సమాజాన్ని ఉన్నత కుల సమూహంగా పరిగణిస్తారు. ప్రమాదంలో మరణించిన వారి కోసం విస్తృతంగా సంతాపం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ విధించబడింది. పవిత్రన్ వ్యాఖ్యలను చాలా మంది అనుచితంగా, కులతత్వపూరితంగా నెటిజన్లు అభివర్ణించారు.

రంజిత యునైటెడ్ కింగ్‌డమ్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఇక్కడ తన ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పత్రాలను పూర్తి చేయడానికి నాలుగు రోజుల ముందే భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆమె ఇక్కడ తన ఉద్యోగాన్ని వదిలివేసి, యూకేకి తిరిగి వెళ్తుండగా విమాన ప్రమాదంలో మరణించింది.

Next Story