బాలీవుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీపై కేసు నమోదు.. ఆలయం బేస్‌ క్యాంప్‌లో ఆ పని చేశాడని..

కత్రాలోని వైష్ణో దేవి మందిరం బేస్ క్యాంప్ వద్ద మద్యం సేవించారనే ఆరోపణలపై బాలీవుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి, మరో ఏడుగురిపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

By అంజి  Published on  17 March 2025 1:30 PM IST
Influencer Orry, alcohol drinking, Vaishno Devi base camp, Jammu Kashmir

బాలీవుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీపై కేసు నమోదు.. ఆలయం బేస్‌ క్యాంప్‌లో ఆ పని చేశాడని..

కత్రాలోని వైష్ణో దేవి మందిరం బేస్ క్యాంప్ వద్ద మద్యం సేవించారనే ఆరోపణలపై బాలీవుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి, మరో ఏడుగురిపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు కాట్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఓర్రీతో పాటు, ఎఫ్‌ఐఆర్‌లో దర్శన్ సింగ్, పార్థ్ రైనా, రితిక్ సింగ్, రక్షిత భోగల్, షాగున్ కోహ్లీ, రాశి దత్తా, రష్యన్ జాతీయురాలు అనస్తాసిలా అర్జామస్కినా కూడా ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్రాలో మద్యం సేవించడం, మాంసాహారం నిషేధించబడింది. ఇక్కడే భక్తులు వైష్ణో దేవి మందిరానికి తమ పవిత్ర యాత్రను ప్రారంభిస్తారు.

"కత్రా పట్టణంలో మద్యం సేవించినందుకు బాలీవుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్రీపై కత్రా పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం పవిత్ర పట్టణమైన కత్రాలో మద్యం అమ్మకం, కలిగి ఉండటం, సేవించడం నిషేధించబడింది" అని ఆ వర్గాలు తెలిపాయి.

వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్‌ ప్రకారం.. మార్చి 15న ఆవరణలో కొంతమంది అతిథులు మద్యం సేవిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. "జీరో టాలరెన్స్" కు ఉదాహరణగా నిలిచేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

"ఈ విషయం యొక్క తీవ్రతను గ్రహించి, వారిని పట్టుకోవాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే అటువంటి చర్యను మతపరమైన ప్రదేశంలో ఎంతమాత్రం సహించబోమని రియాసిలోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ పరమ్‌వీర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Next Story