మరో క్షిపణి సక్సెస్.. డీఆర్డీవోలో ఆనందం

India successfully test fires Prithvi-II missile.డీఆర్డీవో మరో సక్సెస్ ను అందుకుంది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 10:07 AM GMT
మరో క్షిపణి సక్సెస్.. డీఆర్డీవోలో ఆనందం

డీఆర్డీవో మరో సక్సెస్ ను అందుకుంది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మిస్సైల్‌ను పరీక్షించగా విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్షిపణిని డీఆర్డీవో దేశీయంగా అభివృద్ధి చేసింది. నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టిందని తెలిపింది.

పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్‌.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి. పరీక్ష సమయంలో క్షిపణి పూర్తిగా అనుకున్నట్లుగానే దూసుకుని వెళ్ళింది. ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో కూడా విజ‌య‌వంతంగా పరీక్షించారు. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను కలిగిన పృథ్వీ-2.. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. పృథ్వీ-2 మిస్సైల్‌ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది.

Next Story