భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

India reports new covid-19 cases in last 24 hours.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2021 5:36 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,15,501 క‌రోనా శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 38,792 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074కి చేరింది. నిన్న ఒక్క రోజే 624 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,11,408 కి పెరిగింది.

నిన్న 41,000 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,01,04,720 చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,29,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.28శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.25శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.10శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 37.14 ల‌క్ష‌ల మందికి టీకా అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 38.76 కోట్ల‌కు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story