భార‌త్‌లో త‌గ్గుమ‌ఖం ప‌డుతున్న కరోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India reports new covid 19 cases in last 24 hours.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. వరుస‌గా 52వ రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 4:53 AM GMT
భార‌త్‌లో త‌గ్గుమ‌ఖం ప‌డుతున్న కరోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. వరుస‌గా 52వ రోజు దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీ ఎక్కువ‌గా న‌మోదైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,38,490 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 43,071పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కి చేరింది. నిన్న ఒక్క రోజే 955 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,02,005 కి పెరిగింది.

నిన్న52,299 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,96,58,078కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 2,96,58,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.09శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. వ్లీకీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.44శాతంగా ఉందని తెలిపింది. మరో వైపు రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా తగ్గిందని వివరించింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 63,87,849 ల‌క్ష‌లు టీకాలు అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 35,12,21,306 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story