తగ్గుముఖం పడుతున్న కరోనా.. వరుసగా నాలుగో రోజు 2లక్షల లోపే కేసులు
India reports new covid 19 cases in last 24 hours.దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24
By తోట వంశీ కుమార్ Published on
31 May 2021 4:45 AM GMT

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,88.135 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,52,734 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3128 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,29,100 లకు చేరింది. నిన్న 2,38,022 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,56,92,342 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 21,31,54,129 డోసులు వేసినట్లు చెప్పింది
Next Story