భారత్లో కరోనా తగ్గుముఖం.. నాలుగో రోజు లక్షకు దిగువనే
India reports 91702 new covid 19 cases in last 24 hours.భారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వరుసగా
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2021 5:21 AM GMT
భారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువకు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,44,131కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 91,702 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,403 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/qwUfmHUb8q
— ICMR (@ICMRDELHI) June 11, 2021
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,63,079కి పెరిగింది. నిన్న 1,34,580 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,77,90,073కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,21,671యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 94.93శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5.14శాతంగా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.48శాతంగా ఉండగా.. వరుసగా 18వ రోజు పదిశాతం కంటే తక్కువగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్లో 24,60,85,649 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.