తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

India reports 84332 new covid 19 cases in last 24 hours.ప‌లు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్ష‌ల ఫ‌లితంగా దేశంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 5:06 AM GMT
తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

ప‌లు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్ష‌ల ఫ‌లితంగా దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,20,477 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 84,332 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155 కి చేరింది. నిన్న ఒక్క రోజే 4,002 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,67,081కి పెరిగింది. నిన్న 1,21,311 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,79,11,384కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 10,80,690 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 95.07శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికి తక్కువగా పడిపోయిందని, ప్రస్తుతం 4.94 శాతంగా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39శాతంగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 24,96,00,304 మంది టీకాలు వేయించుకున్నారు.

Next Story