కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
India reports 80834 new covid 19 cases in last 24 hours.పలు రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్లు, ఆంక్షల ఫలితంగా దేశంలో
By తోట వంశీ కుమార్
పలు రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్లు, ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసులు లక్షకు దిగువనే నమోదు అవుతుండడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 19,00,312 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 80,834 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,39,989 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,303 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/jlK9aqjPza
— ICMR (@ICMRDELHI) June 13, 2021
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,70,384కి పెరిగింది. నిన్న 1,32,062 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,80,43,446 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 10,26,159 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.26శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువకు పడిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం 4.74 శాతంగా ఉందని, రోజువారి పాజిటివిటీ రేటు 4.25శాతంగా ఉందని, వరుసగా 20వ రోజు పది కన్నా తక్కువన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 25,31,95,048 టీకా డోసులు అందించారు.