త‌గ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రిక‌వ‌రీ

India Reports 60753 new covid 19 cases in last 24 hours.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 4:41 AM GMT
త‌గ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రిక‌వ‌రీ

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,02,009 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 60,753 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య2,98,23,546 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,647 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,85,137 కి పెరిగింది. నిన్న 97,743 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,86,78,390కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 7,60,019 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.16 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికంటే తక్కువగా ఉందని, ప్రస్తుతం 3.58శాతానికి చేరిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.98శాతానికి తగ్గిందని.. వరుసగా 12 రోజుల్లో ఐదు శాతానికి తక్కువగా ఉందని పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ తీసుకున్న‌వారి సంఖ్య 27,23,88,783కి చేరింది.

Next Story