దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India reports 54069 new covid 19 cases in last 24 hours.నిన్న‌టితో పోలిస్తే నేడు దేశంలో రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 4:39 AM GMT
దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

నిన్న‌టితో పోలిస్తే నేడు దేశంలో రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,59,469 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 54,069 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,321 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,91,981 కి పెరిగింది.

నిన్న 68,885 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,90,63,740కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 6,27,057 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.61శాతానికి పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పింది. వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి తక్కువగా ఉందని.. ప్రస్తుతం 3.04శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.91శాతానికి తగ్గిందని చెప్పింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 30,16,26,028 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story