భారత్లో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
India reports 51667 new covid 19 cases in last 24 hours.నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో రోజువారి పాజిటివ్ కేసుల
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2021 4:19 AM GMT
నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 17,35,781 శాంపిళ్లను పరీక్షించగా.. 51,667 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,34,445కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,329 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,93,310 కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) June 25, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/lUPQgrTviK pic.twitter.com/7fsHKAGOhC
నిన్న 64,527 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,91,28,267కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 6,12,868 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.66శాతంగా ఉందని చెప్పింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3శాతానికి పడిపోయిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.98శాతానికి తగ్గిందని పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 30,79,48,744 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.