భార‌త్‌లో 3కోట్లు దాటిన క‌రోనా కేసులు

India Reports 50848 new covid 19 cases in last 24 hours.భార‌త్‌లో క‌రోనా కేసులు మూడు కోట్ల మార్కును దాటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2021 4:37 AM GMT
భార‌త్‌లో 3కోట్లు దాటిన క‌రోనా కేసులు

భార‌త్‌లో క‌రోనా కేసులు మూడు కోట్ల మార్కును దాటాయి. ఇక నిన్న‌టితో పోలిస్తే నేడు క‌రోనా కేసులు కాస్త స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,01,056 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 50,848 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య3,00,28,709కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,358 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,90,660కి పెరిగింది.

నిన్న 68,817 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,89,94,855కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 6,43,194 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.67శాతానికి పడిపోయిందని తెలిపింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క‌రోజే 54,24,374 మందికి టీకా అందింది. ఇప్ప‌టి వ‌ర‌కు 29కోట్ల 46ల‌క్ష‌లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story