స్వల్పంగా పెరిగిన కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
India Reports 50040 New covid 19 cases in last 24 hours.నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.
By తోట వంశీ కుమార్ Published on
27 Jun 2021 4:56 AM GMT

నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,77,309 శాంపిళ్లను పరీక్షించగా.. 50,040 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,33,183కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,258మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,95,751కి పెరిగింది.
నిన్న 57,944 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,92,51,029కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,86,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 96.75శాతానికి పెరుగగా.. వీక్లి పాజిటివ్ రేటు 1.94కి పడిపోయిందని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 64,25,893టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 32,17,60,077 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story