దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

India reports 45892 New covid-19 cases in last 24 hours.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌ళ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2021 5:06 AM GMT
దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌ళ్లీ పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్న‌టితో పోలిస్తే 5శాతం కేసులు ఎక్కువ‌గా న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,93,800 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 45,892 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,09,557కి చేరింది. నిన్న ఒక్క రోజే 817 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,05,028 కి పెరిగింది.

నిన్న 44,291 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,98,43,825 చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,60,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.37శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 33,81,671 ల‌క్ష‌లు టీకాలు అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 36.48 కోట్ల‌కు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story