కరోనా అప్డేట్.. దేశంలో 97.06 శాతానికి పెరిగిన రికవరీ రేటు
India reports 44111 Newcovid-19 cases in last 24 hours.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన
By తోట వంశీ కుమార్ Published on
3 July 2021 4:45 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,76,036 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 44,111 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,02,362కి చేరింది. నిన్న ఒక్క రోజే 738 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,01,050 కి పెరిగింది.
నిన్న 57,477 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,96,05,779కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,95,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.06 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.50శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 43,99,298 లక్షలు టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 34,46,11,291 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story