భారత్ కరోనా అప్డేట్.. 41వేలకేసులు.. 41వేల రికవరీలు
India reports 41506 new covid-19 cases in last 24 hours.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో
By తోట వంశీ కుమార్ Published on 11 July 2021 4:32 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 18,43,500 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 41,506 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,94,456కి చేరింది. నిన్న ఒక్క రోజే 895 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,08,040 కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 11, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/edN8RuEQKH pic.twitter.com/SkuIk0NOAB
నిన్న 41,526 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,99,75,064 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,54,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.20శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.32శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.25శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 37,23,367 లక్షలు టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 37,60,32,586 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.