దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
India Reports 37566 new covid-19 cases in last 24 hours.భారత్లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారి
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 5:04 AM GMT
భారత్లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారి కేసులతో పాటు మరణాలు సైతం దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,68,008 శాంపిళ్లను పరీక్షించగా.. 37,566 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దాదాపు 100 రోజుల తరువాత రోజువారి కేసుల సంఖ్య ఈ స్థాయిలో క్షీణించాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. నిన్న ఒక్క రోజే 907 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,97,637కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) June 29, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/3bPRXkS3nX pic.twitter.com/O7yVWy024q
నిన్న 56,994 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,93,66,601కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 96.87శాతానికి పెరుగగా.. వీక్లి పాజిటివ్ రేటు 1.82కి పడిపోయిందని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 52,76,457 టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 32,90,29,510 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.