భార‌త్‌లో త‌గ్గుమ‌ఖం ప‌డుతున్న కరోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే..

India reports 34703 New covid-19 cases in last 24 hours.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 4:38 AM GMT
భార‌త్‌లో త‌గ్గుమ‌ఖం ప‌డుతున్న కరోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,47,424 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 34,703 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దేశంలో 111 రోజుల తర్వాత అతి తక్కువగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,19,932కి చేరింది. నిన్న ఒక్క రోజే 553 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,03,281 కి పెరిగింది.

నిన్న 51,864 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య2,97,52,294 కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 4,64,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.17శాతానికి పెరిగిందని తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.40శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.11శాతానికి పడిపోయిందని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 45,82,246 ల‌క్ష‌లు టీకాలు అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 35,75,53,612 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story