భారత్లో కాస్త తగ్గిన కేసులు.. పెరుగుతున్న మరణాలు
New corona cases in India today. దేశంలో గడిచిన 24 గంటల్లో 18,32,950 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,11,170 పాజిటివ్ కేసులు నమోదు.
By తోట వంశీ కుమార్ Published on 16 May 2021 5:00 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికి.. మరణాల సంఖ్య నాలుగు వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18,32,950 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,11,170 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. నిన్న ఒక్క రోజే 4,077 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,70,284కి చేరింది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/Ld2Bmcvg1Z
— ICMR (@ICMRDELHI) May 16, 2021
నిన్న 3,62,437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 2,07,95,335కి చేరింది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో టీకా డ్రైవర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18,22,20,164 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.