భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

India Reports 30093 new covid-19 cases in last 24hours.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 4:31 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కేసులు, మ‌ర‌ణాలు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య దిగొచ్చింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,92,336 క‌రోనా శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 30,093 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,74,322కి చేరింది. నిన్న ఒక్క రోజే 374 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,14,482 కి పెరిగింది.

నిన్న45,254 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,03,53,710కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.37శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.06శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 52,67,309 మందికి టీకా అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 41,18,46,401 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story