India Corona : కొత్త‌గా 2,994 కేసులు.. 5 గురు మృతి

గ‌డిచిన 24 గంట‌ల్లో 2,994 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2023 6:08 AM GMT
COVID-19,India corona update

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,43,364 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 2,994 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కేర‌ళ రాష్ట్రంలో ముగ్గురు, గోవా, గుజ‌రాత్‌ల‌లో ఒక్కొక్క‌రు చొప్పున మొత్తం ఐదుగురు మ‌ర‌ణించారు.

దీంతో క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,30,876కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 16,354 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

రిక‌వ‌రీ రేటు 98.77 శాతం ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story