తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా ఎన్నికేసులంటే
India reports 173790 new covid-19 cases in last 24 hours.భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on
29 May 2021 5:21 AM GMT

భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20,80,048 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,73,790 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3,617 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,22,512 లకు చేరింది. నిన్న 2,84,061 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,51,78,011 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 22,28,724 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 90.80శాతానికి పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.84 శాతంగా ఉందని, రోజు వారీ పాజిటివిటీ రేటు 8.36 శాతానికి చేరుకుందని పేర్కొంది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 20,89,02,445 డోసులు వేసినట్లు చెప్పింది.
Next Story