భారత్ కరోనా అప్డేట్.. భారీగా పెరిగిన కేసులు
India reported 42625 new covid-19 cases today.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 4:34 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీ నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,47,518 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 42,625 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132 కు చేరింది. నిన్న ఒక్క రోజే 562 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,25,757 కు చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 4, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/YK1HxL99hc pic.twitter.com/pqpWoEeF4r
నిన్న 26,668 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,09,33,022 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.37శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.36శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.31 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 62.53లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 48,52,86,570 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.