భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా తగ్గిన కేసులు
India Reported 41649 new Covid-19 cases today.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో
By తోట వంశీ కుమార్ Published on 31 July 2021 4:37 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 17,76,315 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 41,649 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరింది. నిన్న ఒక్క రోజే 593 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,23,810కు చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 31, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/AXH6yySu8e pic.twitter.com/u2YuSa7DFh
నిన్న 37,291 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,07,81,263 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.37శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.42శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 52,99,036 మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 46,15,18,479 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.