భార‌త్ క‌రోనా అప్‌డేట్.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

India reported 39070 new corona cases today.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 4:29 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్.. స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంటల్లో 17,22,221 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 39,070 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరింది. నిన్న ఒక్క రోజే 491 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,27,862 కు చేరింది.

నిన్న 43,910 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,10,99,771 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.39శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.38శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.27 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 55,91,657ల‌క్ష‌ల మందికి టీకా అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 50,68,10,492 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story