భారత్ కరోనా అప్డేట్.. భారీగా పెరిగిన కేసులు
India reported 37593 new corona cases today.భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2021 4:48 AM GMT
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే 47.6 శాతం ఎక్కువగా కేసుల సంఖ్య నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 17,92,755 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 37,593 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,12,366కి చేరింది. నిన్న ఒక్క రోజే 648 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,35,758కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 25, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/EPKZJpwLC9 pic.twitter.com/4BpUTvhnm3
నిన్న34,169 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,17,54,281కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.67శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.92శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.10 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 61,90,930 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 59.55 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.