భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన మ‌ర‌ణాలు

India reported 36401new corona cases today.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌రోసారి కేసులు, మ‌ర‌ణాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2021 4:47 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌రోసారి కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో 18,73,757 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా 36,401 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258 కి చేరింది. నిన్న ఒక్క రోజే 530 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,33,049కి చేరింది.

నిన్న39,157 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,15,25,800 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,64,129 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.53శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 56,36,336 మంది టీకా వేయించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 56.64 కోట్ల‌ టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story