భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India reported 25467 new corona cases today.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,47,526 కరోనా
By తోట వంశీ కుమార్ Published on
24 Aug 2021 5:09 AM GMT

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,47,526 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 25,467 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.24కోట్లకి చేరింది. నిన్న ఒక్క రోజే 354 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,35,110కి చేరింది.
నిన్న39,486 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,17,20,112 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,19,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.68శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.90శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.55 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 63,85,298 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 58.89 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story