క‌రోనా అప్‌డేట్‌.. 154 రోజుల త‌రువాత భారీగా త‌గ్గిన కేసులు

India reported 25166 new corona cases today.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2021 4:51 AM GMT
క‌రోనా అప్‌డేట్‌.. 154 రోజుల త‌రువాత భారీగా త‌గ్గిన కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 15,63,985 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 25,166 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679 చేరింది. నిన్న ఒక్క రోజే 437 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,32,079 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 36,830 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,14,48,754 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,69,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.51శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 88,13,919 మంది టీకా వేయించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 55.47 కోట్ల‌ టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story