దేశంలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

India logs 228 new coronavirus infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2023 5:29 AM GMT
దేశంలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,99,731 మందికి క‌రోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 228 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. కొత్త కేసులతో క‌లిసి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా న‌లుగురు మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,30,714కి పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో 2,503 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతంగా ఉండ‌గా మరణాలు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.12 కోట్ల కరోనా టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Next Story